‘సిగ్మా’ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘సిగ్మా’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. అనౌన్స్మెంట్ నాటి నుంచే సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా, టీజర్కు అద్భుతమైన స్పందన రావడంతో మరింత హైప్ను సొంతం చేసుకుంది. టీజర్ ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సినిమాపై అంచనాలను పెంచింది. లైకా ప్రొడక్షన్స్ హెడ్ జి.కె.ఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ.. “జూలై 31న ‘సిగ్మా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆనందంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఇది ఒక కొత్త సినీ అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం…
