భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు
సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన 'మీర్జాపురంరాణి - కృష్ణవేణి ' పుస్తకానికి వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డును ప్రదానం చెయ్యడం ఎంతో సముచితంగా ఉందని సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. హైదరాబాద్ శ్రీత్యాగరాయ గాన సభలో వంశీ సంస్థ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది . బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొని జర్నలిస్ట్ భగీరథ , నిర్మాత ఎన్ .ఆర్ . కృష్ణవేణి ని సత్కరించి...అవార్డును ప్రదానం చేశారు . ఈ సందర్భగా నరసింహారావు మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు 103వ జయతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ , రచయిత భగీరథ గారిని…
