‘స్వయంభూ ‘ నుంచి ‘రా రా ధీవర’ పాట 16న రిలీజ్
'కార్తికేయ 2'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్ భువన్, శ్రీకర్ నిర్మాణంతో, టాగోర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ 'రా రా ధీవర' ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఒక పవర్ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్లో నిఖిల్ ఒక యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు. ఈ పాట ఎంత గ్రాండ్గా, అద్భుతంగా, కళ్లు చెదిరేలా…
