మే 29న “నేనెవరు?” గ్రాండ్ రిలీజ్
“నువ్వేకావాలి”, “ప్రేమించు” వంటి సూపర్ హిట్ చిత్రాల ఫేమ్ సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్య పాత్రల్లో యువ ప్రతిభాశాలి చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో తెరకెక్కిన సందేశభరిత వినోదాత్మక చిత్రం “నేనెవరు?” మే 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలకు సిద్ధమైంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే అంశాలను కలగలిపి రూపొందించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో సాయికిరణ్, జోగిని శ్యామల తమ అనుభవంతో కూడిన ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించనుండగా, కుటుంబ ప్రేక్షకులతో పాటు యువతను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలు, వినోదం, సస్పెన్స్ మేళవింపుతో దర్శకుడు…
