Skip to content

“ఐకానిక్ సినిమాటోగ్రాఫర్”అవార్డు అందుకున్న “కిషోర్ బొయిదాపు”

"పారితోషికం కంటే పనిలో సంతృప్తి"కి ప్రాధాన్యత కిషోర్ బొయిదాపు ప్రత్యేకత!! ప్రముఖ హీరోయిన్ హన్సిక మోత్వాని నటించిన "105 మినిట్స్" చిత్రానికిగాను... సినిమాటోగ్రఫీ విభాగంలో "ఇంటర్నేషనల్ ఐకానిక్ అవార్డ్" ఆదుకున్నారు టాలెంటెడ్ యువ కెమెరామెన్ కిషోర్ బొయిదాపు. పరిమిత బడ్జెట్ లో సింగిల్ క్యారక్టర్ తో.. సింగిల్ షాట్ లో తెరకెక్కి ఉండడం "105 మినిట్స్" సినిమా ప్రత్యేకత. హైద్రాబాద్ లో నిన్న (జూన్ 27, 2025) లీ-మెరిడియన్ హోటల్ లో కోలాహలంగా జరిగిన వేడుకలో కిషోర్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా "105 మినిట్స్" చిత్ర దర్శకులు రాజు దుస్సా, నిర్మాత బొమ్మక్ శివలకు కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు! రవిప్రసాద్ యూనిట్ లో కెమెరా అసిస్టెంట్ గా తన కెరీర్…

Read more

“కిల్లర్” మూవీ గ్రాండ్ గా లాంచ్

మల్టీ టాలెంటెడ్ సూపర్‌స్టార్ ఎస్‌జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్‌ ఇండియా చిత్రం టైటిల్ "కిల్లర్". ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్‌జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్‌జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, మలయాళ, కన్నడ తదితర భాషలలో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన గొకులం మూవీస్, ఈ సినిమాతో తమిళ సినీ రంగంలో కం బ్యాక్ ఇస్తోంది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు వి.సి. ప్రవీణ్,…

Read more

ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు “తమ్ముడు” మూవీకి సెన్సార్ నుంచి ‘ఎ’ సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు". తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్ తో ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇటీవల "తమ్ముడు" మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు…

Read more

‘ ఓ భామ అయ్యో రామ’ చిత్రం నుంచి ‘గల్లి స్టెప్‌ సాంగ్‌ విడుదల

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం నుంచి తాజాగా 'గల్లి స్టెప్‌ లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. 'ఓ మెరుపులా చిందులే వేయారా' అంటూ కొనసాగే ఈ పాటను కథానాయకుడు సుహాస్‌ ఆలపించడం విశేషం. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన…

Read more

“ఉప్పు కప్పురంబు” మ్యూజిక్ ఆల్బమ్ విడుదల

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా "ఉప్పు కప్పురంబు" ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా పాడబడ్డాయి. సంగీతాన్ని స్వీకార్ అగస్తి అందించగా, పాటల రాతలు రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం మరియు రఘురాం ద్రోణావజ్జల చేశారు. ఈ పాటలు పాడిన సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్, వీళ్ళ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి.ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు…

Read more

*సోషియోఫాంటసీగా “దీర్ఘాయుష్మాన్ భవ”*

ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా సోషియో ఫాంటసీ ప్రేమకథతో సినిమాగా "దీర్ఘాయుష్మాన్ భవ" చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లు. ఎం.పూర్ణానంద్ దర్శకత్వం వహించారు. త్రిపుర క్రియేషన్స్ పతాకంపై వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ కథాశంతో రెండున్నర గంటలపాటు ప్రీక్షకులను అలరింపజేసే వినోదంతో ఈ చిత్రాన్ని మలచడం జరిగిందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్ కు ప్రాధాన్యం ఇచ్చాం. ఏ పాటకు ఆ పాట ఆహ్లాదభరితంగా ఉంటుందని అన్నారు. యూత్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు. …

Read more

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

2024లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకోవటమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. యూత్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు చిత్ర దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా కూడా అవార్డ్ వచ్చిన విషయం తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే అందరినీ మెప్పించిన ఈ సక్సెస్‌ఫుల్ బ్యానర్‌లో ఇప్పుడు రెండో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందనున్న రెండో సినిమాకు…

Read more

‘కన్నప్ప’ కల్పితం కాదు.. అది మన చరిత్ర.. ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది.. మీడియా మీట్‌లో విష్ణు మంచు

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న విడుదల కాబోతోంది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మాణంలో ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో గురువారం నాడు విష్ణు మంచు, కన్నప్ప టీం మీడియాతో ముచ్చటించింది. ఈ కార్యక్రమంలో విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కు ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు తెగాయి. ఇంతటి రెస్పాన్స్ చూసి నాకు ఆనందమేస్తోంది. ఇదంతా శివ లీల అనిపిస్తుంది. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి…

Read more