ఏపీ, తెలంగాణలో రెండు రోజుల్లో 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న కల్ట్ మూవీ “రాజు వెడ్స్ రాంబాయి”
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన "రాజు వెడ్స్ రాంబాయి" సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఈ సినిమాకు 4.04 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. నైజాం ఏరియాలో బాక్సాఫీస్ వద్ద డామినేషన్ చూపిస్తోందీ మూవీ. నైజాంలో డే 1 కు రెట్టింపు వసూళ్లను డే2 రాబట్టింది "రాజు వెడ్స్ రాంబాయి". తొలి రోజు కోటి రూపాయల గ్రాస్ ఈ సినిమాకు కలెక్ట్ కాగా, రెండో రోజు 2 కోట్ల రూపాయల…
