పద్మశ్రీ అందుకున్న నటుడు మురళీమోహన్, గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిసిన వేడుక
భారత ప్రభుత్వం నుండి తనకు పద్మశ్రీ పురస్కారం అందిన సందర్భంగా ప్రఖ్యాత నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు మర్యాదపూర్వకంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రతాప్ శుక్లా గారిని నేడు లోక్ భవన్ లో కలిసారు. శ్రీ మురళీమోహన్ గారిని గౌరవ గవర్నర్ గారు అభినందించి సత్కరించారు. చిత్రంలో కుటుంబ సభ్యులు శ్రీమతి రూపా మాగంటి, శ్రీ బి.యస్.రావు కూడా ఉన్నారు.
