‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘‘కమ్సాహంనిదా’ పాట రిలీజ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది, మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ను చివరి దశకు చేరుకుంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రం, భారతీయ, కొరియన్ నేపథ్యాలలో హారర్, కామెడీ,క్రాస్ కల్చర్ మేళవింపుతో పుల్ లెంత్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ క్యారెక్టర్ కోసం అద్భుతమైన మేకోవర్ అయిన వరుణ్ తేజ్, మునుపెన్నడూ చూడని పాత్రతో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చిత్ర బృందం ఇప్పుడు ఈ ఫస్ట్ మొదటి సింగిల్ 'కమ్సాహంనిదా'ను విడుదల చేసింది. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ పాట రితికా నాయక్ సరదాగా 'కమ్సాహంనిదా' అని పలకడంతో ప్రారంభమవుతుంది. దానికి…
