Skip to content

సింగరేణి కార్మికుల నిజ జీవిత కథతో హీరో సాగర్ పాన్ ఇండియా చిత్రం.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

‘ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. సింగరేణి బొగ్గు గనుల…

Read more

యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు హీరోగా ‘విలయ తాండవం’.. ఘనంగా టైటిల్ పోస్టర్ లాంఛ్ ఈవెంట్

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లకు ప్రస్తుతం లభిస్తున్న ఆదరణ అందరికీ తెలిసిందే. అలాంటి ఓ వినూత్నమైన కథాంశంతో ప్రస్తుతం ఓ చిత్రం రూపు దిద్దుకుంటోంది. యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1 గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ‘విలయ తాండవం’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను బుధవారం (అక్టోబర్ 1) నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా…

Read more

ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతున్న ‘అరి’ సినిమా

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, నాయుడు నిర్మిస్తున్న సినిమా ‘అరి’. లింగ గుబపనేని కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. విజయదశమి సందర్భంగా ‘అరి’ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘అరి’ సినిమాను ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ…

Read more

ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీరగా గర్జించిన చిత్రం 'ఓజీ'. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా, భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 25న థియేటర్లలో అడుగుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ 24 రాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రదర్శించబడ్డాయి. మొదటి షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ చూడని విధంగా దర్శకుడు సుజీత్ చూపించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, సుజీత్ దర్శకత్వ ప్రతిభ, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం, రవి కె చంద్రన్, మనోజ్ పరమహంసల కట్టిపడేసే కెమెరా…

Read more

“బాలి” చిత్రం పోస్టర్, గ్లింప్స్ రిలీజ్

పాలిక్ స్టూడియోస్, బి ఎస్ ఆర్ కె, డి ఆర్ ఎస్ మరియు ఆర్ ఎస్ క్రియేషన్ టీమ్ వర్క్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "బాలి". ఈ చిత్రానికి పాలిక్ కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. మారుమూల ప్రాంతంలోని ఒక తాండాలో జరిగిన యధార్థ కథని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు జన్మలకు సంబంధించిన ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ మనిషికి భగవంతుడు తోడైతే అనే ఒక మంచి కథ నేపథ్యంతో నిర్మిస్తున్న చిత్రం "బాలి". ఈ చిత్రంలో ఐదు పాటలు, ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు, కామెడీ, సెంటిమెంట్ అన్ని కల కలుపుకొని ఒక చక్కటి జానపద చిత్రంగా మీ ముందుకు రాబోతుంది అన్నారు దర్శకుడు పాలిక్…

Read more

ప్రేమ రహదారిపై తుపాన్‌! ‘ఆన్ ది రోడ్’ అక్టోబర్ 10, 2025న థియేటర్స్‌లో

తెలుగు తెరపై తొలిసారి రోడ్-ట్రిప్ థ్రిల్లర్ రూపంలో ఓ వినూత్న కథ రాబోతోంది. ‘ఆన్ ది రోడ్’ టైటిల్ తో రూపొందిన ఈ చిత్రం, పూర్తిగా లడఖ్ లోయల్లో, ప్రకృతి అందాల మధ్య చిత్రీకరించబడింది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సూర్య లక్కోజు, గతంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో అనేక ప్రాజెక్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం, ఆర్‌జీవీ స్వయంగా ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇప్పటికే ఈ సినిమాపై మంచి ఆసక్తి పెరిగింది. “ఓ యువకుడు, అనుకోకుండా లడఖ్ రోడ్ ట్రిప్ లో తన మాజీ ప్రియురాలిని కలుస్తాడు. అయితే ఆమె తన భర్తతో తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్…

Read more

కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్

నవరాత్రుల సందర్భంగా 51 శక్తి పీఠాలలో ప్రాచీనమైనదిగా ప్రసిద్ధి పొందిన అస్సాం గౌహతిలోని పవిత్ర పుణ్యక్షేత్రం కామాఖ్యదేవి ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. సతీమణి భూమా మౌనిక, స్నేహితులతో కలిసి గౌహతి చేరుకున్న మనోజ్ కు హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. ఆయన కొత్త సినిమా మిరాయ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ లో అందరినీ ఆకట్టుకున్నారు మనోజ్. మిరాయ్ విజయం తర్వాత అయోధ్య శ్రీరాముడిని దర్శించుకున్నారు మనోజ్. ఇప్పుడు కామాఖ్యదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

Read more

మన శంకరవరప్రసాద్ గారు నుంచి శశిరేఖగా నయనతార

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'లో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. శశిరేఖగా ది మాగ్నిఫిసెంట్ నయనతారను పరిచయం చేస్తూ, మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పసుపు రంగు చీరలో మెరిసిపోతూ కనిపించిన ఆమె లుక్ అదిరిపోయింది. ముత్యాల హారం, సంప్రదాయ గాజులతో, చేతిలో నలుపు రంగు హ్యాండిల్‌తో ఉన్న గొడుగును పట్టుకొని, ఫెస్టివల్ వైబ్ కనిపించిన ఈ లుక్ శశిరేఖ పాత్రకు గొప్ప సొగసుని తీసుకొచ్చింది. నయనతార పాత్ర కథలో చాలా…

Read more

రవితేజ ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల

మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు, తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మాస్ జతర' చిత్రం అక్టోబర్ 31, 2025న విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. వింటేజ్ వైబ్స్, పక్కా కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం థియేటర్లలో అసలుసిసలైన మాస్ పండుగను తీసుకురాబోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన ప్రతి కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, వినోదాల విందుకి హామీ ఇచ్చింది. కొత్త విడుదల తేదీ ప్రకటన సందర్భంగా రవితేజ, హైపర్ ఆదిలపై చిత్రీకరించిన ఒక సరదా వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో హైపర్ ఆది 2025 సంక్రాంతి, వేసవి సెలవులు, వినాయక చవితి అంటూ పలుసార్లు సినిమా వాయిదా…

Read more

రోరింగ్ స్టార్ శ్రీమురళి ‘పరాక్’ అఫీషియల్ గా లాంచ్

శ్రీమురళి చిత్రం 'పరాక్' శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి శ్రీమురళి కొత్త చిత్రం 'పరాక్' కు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీమురళి తొలిసారి దర్శకుడు హలేష్ కోగుండితో 'పరాక్' కోసం జతకట్టారు. బగీరా విజయం తర్వాత, రోరింగ్ స్టార్ శ్రీమురళి 'పరాక్' కు సైన్ అప్ చేశారు. ఈ చిత్రం ముహూర్త వేడుక ఈరోజు బెంగళూరులోని బండి మహాకాళి ఆలయంలో జరిగింది, చన్నగిరి ఎమ్మెల్యే శివగంగ బసవరాజు ప్రారంభోత్సవం సందర్భంగా క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీమురళి విలేకరులతో మాట్లాడుతూ.."పరాక్ ఒక వింటేజ్ స్టైల్ సినిమా. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కథ ఎంచుకోవడానికి దాదాపు 200 స్క్రిప్ట్‌లను విన్నాను. నేను గత రెండు…

Read more