గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ…
జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు -పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి

- నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం
72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు శ్రీ మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. శ్రీ మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి శ్రీ కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన శ్రీమతి యామీ గౌతమ్ కు అభినందనలు.
తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభపరిణామం. ఉత్తమ పాపులర్ చిత్రంగా కల్కి 2898 ఎ.డి., ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కల్కి 2898 ఎ.డి., (నితిన్ జిహాని చౌదరి), ఉత్తమ బాలల చిత్రంగా 35 – చిన్న కథ కాదు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్ దేవ్ పోతుల, ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ సంభాషణల రచయితగా శ్రీ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో పుష్ప 2 (దీపాలి నూర్, శీతల్ శర్మ) దక్కించుకున్నారు. వీరందరికీ అభినందనలు.
నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారానికి ఎంపిక కావడం సంతోషాన్నిచ్చింది. నిర్మాతగా నిహారిక చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పుతోపాటు అవార్డులు దక్కించుకొంది. చిత్ర నిర్మాణంలో నిహారికతోపాటు భాగమైన శ్రీమతి పద్మజ కొణిదెల, శ్రీమతి జయలక్ష్మి అడపాక, ఈ చిత్ర దర్శకుడు శ్రీ యదు వంశీకి అభినందనలు. ఈ చిత్రానికి మేకప్ ఆర్టిస్ట్ గా బాధ్యతలు చూసిన శ్రీ పి.రవి కుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. ఆయనకు అభినందనలు.
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి

