సిరివెన్నెల గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్నారు- కె. నాగబాబు
- ఎదుటివారికి సహాయం చేయడమే కానీ, ఇతరులను సహాయం అడగడం ఆయనకు తెలియదు - ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకొనేంత గొప్ప మహనీయులు - 'సిరివెన్నెల స్మృతివనం' శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు ఆస్తులను మించిన ఆత్మీయులను సంపాదించుకున్న మహనీయులు, ఆయన మా తెలుగువాడని, ప్రతి తెలుగువారు గర్వంగా చెప్పుకునేంత గొప్ప కవి శ్రీ చెంబోలు (సిరివెన్నెల) సీతారామశాస్త్రి గారు అని రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. అనకాపల్లి నియోజకవర్గం గాంధీనగర్లో రూ.39.70 లక్షల జీ.వీ.ఎం.సీ. నిధులతో, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 'సిరివెన్నెల స్మృతివనం'కు శాసనమండలి సభ్యులు శ్రీ…
