Skip to content

‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ 27న రిలీజ్

‘గోదారి గట్టుపైన’ ట్రైలర్  27న రిలీజ్ Telugu News

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’ తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది.
నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది.
ఈ రోజు మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ‘గోదారి గట్టుపైన’ ట్రైలర్ ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నారు.
ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ క్యూట్ రొమాంటిక్ వైబ్‌ తో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ చిత్రానికి నాగ వంశీ కృష్ణ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్, ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రవాల్య, ఎడిటింగ్‌ను అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైన్‌ను నాగార్జున తల్లపల్లి నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రం మే 8న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.
తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర
బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్
నిర్మాత – అభినవ్ రావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక
DOP – సాయి సంతోష్
సంగీతం – నాగ వంశీ కృష్ణ
ఎడిటర్ – అనిల్ కుమార్ పి
సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి
ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి
PRO – వంశీ-శేఖర్
మార్కెటింగ్ – ఫస్ట్ షో