Skip to content

మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ

మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ Telugu News
మైత్రీవనం చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ విగ్రహం ఆవిష్కరణ Telugu News

జూబ్లీహిల్స్ బైఎలక్షన్ సందర్భంగా నందమూరి అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం, గెలిచిన అనంతరం అమీర్పేట్ మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం ద్వారా అభిమానులకు ప్రత్యేక కానుక అందించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ వి. నవీన్ యాదవ్ గారు..

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పోరేషన్ చైర్మన్లు,ప్రజా ప్రతినిధులు, సినిమా నటులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..

సభను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ..

ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారిని నేను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు..

మైత్రివనం చౌరస్తాలో భారతదేశం గర్వించదగ్గ యావత్తు తెలుగు జాతి చేత అన్నా అని పిలిపించుకున్న గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు అన్నారు..

• ఆనాడు తాడిత, పీడిత వర్గాల కోసం, మహిళల ఓటు హక్కు కోసం కృషి చేసి, దళితవాడల్లో నివసించే పేదలకు కూడా ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నేడు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు..

• ఇందిరాగాంధీ ఉక్కు మహిళ అని, జమీందారుల చేతుల్లో ఉన్న రాజభరణాలను రద్దు చేసి, భూస్వాముల వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచారని అన్నారు..

• భూమి కోసం, భుక్తి కోసం, పేదల విముక్తి కోసం పోరాడిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు..

• నీతి, నిజాయితీ, నిబద్ధతకు ప్రతీక ఎన్టీఆర్ గారని, కులమత భేదాలు లేకుండా దేశం గర్వించదగ్గ నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు..

• ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే నేడు ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు..

• ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో చిరస్మరణీయ ఘట్టమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు..

• ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం స్ఫూర్తితోనే నేడు 6 కిలోల ఉచిత సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు..

• ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఇందిరాగాంధీ కృషి చేస్తే, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్టీఆర్ గారు పాటుపడ్డారని అన్నారు..

• పటేల్-పట్వారి వ్యవస్థను రద్దు చేసి, గ్రామీణ పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చేసిన మహానేత ఎన్టీఆర్ గారని గుర్తు చేశారు..

• దేశానికి ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ గారు కూడా అంతే ముఖ్యమని, ఈ ఇద్దరు మహానేతల ఆలోచనా విధానాలతోనే ప్రస్తుతం ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు..

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.