ప్రైమ్ వీడియో నుంచి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ “చీకటిలో” – ఆకట్టుకుంటున్న ట్రైలర్..
హైదరాబాద్: ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ప్రైమ్ వీడియో', ఈరోజు తమ కొత్త తెలుగు సినిమా "చీకటిలో" ట్రైలర్ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. చంద్ర పెమ్మరాజు మరియు శరణ్ కొపిశెట్టి ఈ కథను అందించారు. సినిమా వివరాలు: హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో, శోభితా ధూళిపాళ 'సంధ్య' అనే పాత్రలో కనిపిస్తారు. సంధ్య ఒక క్రైమ్ పాడ్కాస్టర్. 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్కాస్ట్ ద్వారా కనిపెట్టడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ మరియు విశ్వదేవ్…
