‘సైయారా’ కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథగా నిలిచింది. డైరెక్టర్ మోహిత్ సూరి, నిర్మాత క్షయ్ విధాని(యశ్ రాజ్ ఫిల్మ్స్ సి.ఇ.ఒ), అలాగే జెన్ Z స్టార్స్ అహన్ పాండే, అనీత్ పద్దా కలయికలో మరోసారి ఇంటెన్స్ లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ను నిర్ణయించలేదు. హృదయాన్ని హత్తుకునే కథనం, మరచిపోలేని మెలోడీలతో ఈ సినిమా ఓ ప్రత్యేకమైన సినీ అనుభవాన్ని తప్పకుండా అందిస్తుందనే హామీ ఇస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్లో రూపొందిన సైయారా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను…
