ఈ నెల 31 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు వస్తున్న “దీవాన” మూవీ
యంగ్ టాలెంటెడ్ హీరో హర్షిత్ రెడ్డి నటించిన రీసెంట్ సినిమా "దీవాన" డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై, దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయయ్యారు. గత నెల 20న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన "దీవాన" సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో విజయం సాధించింది. తాజాగా ఓటీటీలోనూ ఆకట్టుకునేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ నెల 31వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో "దీవాన" సినిమా స్ట్రీమింగ్ కు రాబోతోంది. 'మిస్ అయితే మస్త్ ఫీల్ అయితవ్' అంటూ మేకర్స్ ఈ…
