‘ఓ.! సుకుమారి’ కు అద్భుతమైన స్పందన రావడం ఆనందం: హీరో తిరువీర్
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఓ.! సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించారు. జూలై 17న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్ యూ మీట్ నిర్వహించారు. థాంక్ యూ మీట్ లో హీరో తిరువీర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మీరు చూపిస్తున్న ప్రేమకి ధన్యవాదాలు. నిజానికి నా సినిమాలకు ఒక్కో షోకి రెస్పాన్స్ పెరుగుతూ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం, సాయంత్రం, నైట్ షోల వరకు ప్రేక్షకుల స్పందన…
