‘ది ఇండియా స్టోరీ’ ట్రైలర్ రిలీజ్
'ది ఇండియా స్టోరీ: స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' ట్రైలర్ విడుదలైంది. ఇది పురుగుమందుల సాగు అనే ఆందోళనకరమైన సమస్యను, సమాజంపై దాని ప్రభావాలను వెలుగులోకి తెస్తుంది. కాజల్ అగర్వాల్, శ్రేయస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా, ప్రతి ఇంటిని ప్రభావితం చేస్తున్న కీలక సమస్యను ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్ ఫుల్ నటన, సామాజిక సందేశంతో కూడిన ఈ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కిన ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహించారు. సాగర్ బి. షిండే కథ, స్క్రీన్ప్లే అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు…
