Skip to content

ఘనంగా ప్రసాద్ ల్యాబ్స్‌లో “1=100” టీజర్ లాంచ్

శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాబా మైలవరం దర్శకత్వంలో హీరో కృష్ణ కుమార్ మరియు హీరోయిన్ అర్పిత లోహి చిత్రం "1=100" టీజర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత రిజ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై టీజర్‌ను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్రన్ స్టైల్ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్, అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఈ టీజర్ ప్రేక్షకులను, సినీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంది. అనిల్ కుమార్ వేగూరు సినిమాటోగ్రఫీ, కెన్నీ చైతన్య సంగీతం, నందమూరి హరి ఎడిటింగ్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. రాజు ఎంటర్‌టైనర్స్, స్పార్కిల్ డాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ…

Read more

కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ ప్రీ రిలీజ్ వేడుక

▪️జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ ▪️ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా వేడుక ▪️తెలంగాణ ఉద్యమకారిణి కోమలి సినిమాను ఆదరించాలి: కల్వకుంట్ల కవిత ▪️ చిన్న సినిమాలకు ప్రభుత్వం రాయితీలు కల్పించాలి: కల్వకుంట్ల కవిత ▪️"ఒక ఆడబిడ్డ కన్నీటి కథే ఈ సినిమా" –నిర్మాత కోమలి హైదరాబాద్: ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా' జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్…

Read more

RAW NTR పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఒక సంస్థ, ఈ సంస్థకి , ఎన్టీఆర్ కి ఎటువంటి సంబంధం లేదు. – ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటన!

ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేయదలచుకున్నది ఏమనగా, శ్రీ ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, RAW NTR అనే సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం, అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదు. ఆ సంస్థకు శ్రీ ఎన్టీఆర్ గారి తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదు. అలాగే, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేయడానికి లేదా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎలాంటి అధికారమూ లేదు. శ్రీ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం శ్రీ ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడించబడుతుంది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా…

Read more

ప్రభాస్ లాంచ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’ టీజర్‌

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. టైటిల్ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తించగా, ఫస్ట్ సింగిల్ 'కంసంనిద' చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈరోజు రెబెల్ స్టార్ ప్రభాస్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ ప్రారంభంలో కనకరాజు వాయిస్ ఓవర్‌తో తన రాయలసీమలోని పెనుకొండ ఊరిని పరిచయం చేస్తాడు. అల్లరి, సరదాగా తిరిగే కనకరాజు జీవితం ఓ కొరియన్ అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఊహించని మలుపు తిరుగుతుంది. ఇదే సమయంలో…

Read more

‘రాజా ది రాజా’ అందరికీ కనెక్ట్ అయ్యే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్: నిర్మాత కె. నిహారిక దాసరి

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన 'రాజా ది రాజా' చిత్రం థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్, ప్రేమ, వినోదం, యూత్ కు సంబంధించిన భావోద్వేగాల కలయికతో ఆకట్టుకోనుంది. బృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రాన్ని కె. శ్రీలత రెడ్డి సమర్పిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా సినిమా భారీ స్థాయిలో జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె. నిహారిక దాసరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. నిర్మాతగా మారాలనే నిర్ణయం ఎలా తీసుకున్నారు? ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? నిర్మాతగా మారడానికి నాలుగైదేళ్లు ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను…

Read more

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “అదే నీవు అదే నేను” నుంచి సాంగ్ రిలీజ్

త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "అదే నీవు అదే నేను" సినిమా "కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, "సిద్ధార్థ్ రాయ్" సినిమా ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సినిమా "అదే నీవు అదే నేను". ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ పై గోవిందు కాండ్రేగుల నిర్మిస్తున్నారు. రొమాంటిక్ థ్రిల్లర్ కథాంశంతో యువ దర్శకుడు కొండల్ రూపొందిస్తున్నారు. "అదే నీవు అదే నేను" సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి 'మనసా మనసా' సాంగ్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంఛ్ చేశారు. ప్రముఖ…

Read more

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈ మధ్య కాలంలో ఇలాంటి జానర్‌లో సినిమా రాలేదు: నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ

ఫ‌హాద్ ఫాజిల్ హీరోగా ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి సమ‌ర్ప‌ణ‌లో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో.. నిర్మాత ఎస్.ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘ఫహాద్ ఫాజిల్ గారితో సినిమా నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ చూసే ఉంటారు. అందరికీ నచ్చే ఉంటుంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మనసుకు హత్తుకునే చిత్రం. ఇకపై నుంచి రాబోయే కంటెంట్‌ని…

Read more

మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో ఘనంగా బి.ఎస్‌. రావు 3వ వర్ధంతి

శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ప్రముఖ విద్యావేత్త, దార్శనికుడు బి.ఎస్‌. రావు 3వ వర్ధంతిని మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ–‘‘ బి.ఎస్‌. రావుగారి ఆశయాలను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలి’’ అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని బి.ఎస్‌.రావు ఆదర్శాలు, విద్య పట్ల వారి అంకితభావాన్ని ప్రతిబింబించే అందమైన చిత్రాలను రూపొందించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఈ కార్యక్రమంలో మెహదీపట్నం శ్రీ చైతన్య స్కూల్‌ ఆర్, ప్రిన్సిపాల్‌…

Read more

పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీ

మెహిదీపట్నంలోని శ్రీచైతన్య పాఠశాలలో స్మార్ట్‌ లివింగ్‌లో భాగంగా ‘మిషన్‌ హరితోదయ’ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబూని, ‘పర్యావరణాన్ని కాపాడుకుందాం.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత’ అంటూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను తామే తీసుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం బి. కృష్ణ, ఆర్‌ఐ ఎన్‌. స్వాతి మాట్లాడుతూ– ‘‘పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టాలంలే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలి. ప్రకృతిని కాపాడితేనే భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలం’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్‌ జనార్ధన్, డీన్‌ మల్లేష్, ఇన్‌చార్జెస్‌ యాదగిరి, అరుణ, ఉపాధ్యాయులు,…

Read more

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన చంద్రబాబు నాయుడు

ముంబయిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. కొద్దిసేపటి క్రితం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆసుపత్రికి చేరుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు.

Read more