Skip to content

మహా శివరాత్రి సందర్భంగా మహా దేవుడిపై ‘శివ్ కైలాషోం కే వాసి’ పాటను పాడి ఆశ్చర్యపరిచిన రాశీ ఖన్నా

మహా శివరాత్రి పర్వదినాన దేశవ్యాప్తంగా శివ కీర్తనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక మహా దేవుడిపై తాజాగా రాశీ ఖన్నా పాడిన పాట ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. శివుడిపై తనకున్న భక్తిని చాటుకునేలా రాశీ ఖన్నా ఈ పాటను ఆలపించారు. భారత దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివ భక్తితో ఆడియెన్స్‌కి మరింత దగ్గరయ్యారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు సినిమాలు, వెబ్ సిరీస్‌‌లతో ఆకట్టుకున్న రాశీ ఖన్నా ప్రస్తుతం శివుడిపై తన భక్తిని చాటుకునేలా పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాను పాడిన పాటకు వస్తున్న ప్రశంసలపై రాశీ ఖన్నా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ‘‘శివ్ కైలాషోం కే వాసి’ అనేది అహంకారాన్ని నాశనం చేయడం,…

Read more

‘బ్యాండ్ మేళం’ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.. డైరెక్టర్ బాబీ

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ నిర్మించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. ఈ మూవీని మార్చి 13న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ని వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ గ్లింప్స్‌ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌‌కి దర్శకుడు బాబీ, రచయిత బీవీఎస్ రవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ మేరకు నిర్వహించిన ఈవెంట్‌లో.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. ‘‘బ్యాండ్ మేళం’ గ్లింప్స్‌ని వాలెంటైన్స్…

Read more

‘యూఫోరియా’ మూవీపై మహేష్ బాబు ప్రశంసలు – దర్శకుడు గుణశేఖర్

విభిన్నమైన కథలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే దర్శకుడు గుణ శేఖర్ గత వారం (ఫిబ్రవరి 6) ‘యుఫోరియా’ అంటూ బాక్సాఫీస్ సందడి చేశారు. గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ చిత్రాన్ని రాగిణి గుణ సమర్పించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గ కథ, కథాంశంతో గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇటీవలె తెలంగాణ గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని వీక్షించి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. గుణశేఖర్ మేకింగ్‌‌ను ఆయన కొనియాడారు…

Read more

‘మృత్యుంజ‌య్‌’ టీజర్‌ను రిలీజ్ చేసిన దర్శకధీరుడు రాజమౌళి

‘మృత్యుంజ‌య్‌’ చాలా కొత్తగా ఉంటుంది.. మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకి అందించాలనే ఉద్దేశంతో ఈ సినిమాని తీశాం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కింది. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు ఈ చిత్ర టీజర్‌ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి…

Read more

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం.. హీరో శివ కందుకూరి

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్ వాలా’ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’…

Read more

యశ్ ‘టాక్సిక్’ చిత్రానికి హిస్టారికల్ ఓవర్సీస్ డీల్

రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందే అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ప్రతిష్టాత్మకమైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మేరకు రికార్డ్ బ్రేకింగ్ డీల్ జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అదొక చారిత్రాత్మక డీల్‌గా నిలిచింది. ఏకంగా రూ. 120 కోట్లకు హక్కుల్ని సొంతం చేసుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ డీల్ భారతీయ చిత్ర పరిశ్రమను ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. విదేశీ పంపిణీదారులలో ఒకరైన ఫార్స్ ఫిల్మ్ ‘టాక్సిక్’ మూవీని కొనుగోలు చేసింది. ఇది సినిమా అసాధారణ ప్రీ-రిలీజ్ బిజినెస్ డీల్స్‌లో…

Read more

‘టాక్సిక్‌’ తెలుగు హ‌క్కుల‌ను రూ.120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

రాకింగ్ స్టార్ య‌శ్ ప్రెస్టీజియ‌స్ పాన్ ఇండిమా మూవీ ‘టాక్సిక్‌: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’. మార్చి 19న ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా స‌రికొత్త రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తోంది. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు ఈ సినిమా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల‌కు సంబంధించిన హ‌క్కుల‌ను రూ.120 కోట్ల (అడ్వాన్స్ ఆన్ క‌మీష‌న్ బేసిస్‌)కు సొంతం చేసుకోవ‌టం ఇండ‌స్ట్రీలో డిస్క‌ష‌న్ పాయింట్‌గా మారింది. నాన్ తెలుగు సినిమాకు కోసం జరిగిన ఆల్‌టైమ్ బిగ్గెస్ట్ డీల్‌గా మారింది. ఈ ఏడాది విడుదల కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీగా టాక్సిక్ కోసం అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు…

Read more

‘యుఫోరియా’ సినిమాను ఆద‌రిస్తోన్న ప్రేక్ష‌కుల‌కు ధ‌న్య‌వాదాలు: డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్‌

భూమిక ప్రధాన పాత్రలో సారా అర్జున్, నాజర్, రోహిత్, విఘ్నేశ్ గవిరెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘యుఫోరియా’. రాగిణి గుణ సమర్పణలో నీలిమ గుణ, యుక్తా గుణ నిర్మాతలుగా సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్‌ గుణ శేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్‌లో... డైరెక్ట‌ర్ గుణశేఖర్ మాట్లాడుతూ ‘‘యుఫోరియా’ మూవీ సినిమాకు మార్నింగ్ షో నుంచే మంచి ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ టైటిల్ చూసి యూత్ వ‌స్తార‌ని అనుకున్నాను. అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా వ‌స్తున్నారు. భూమిక‌గారు, సారా అర్జున్ అందుకు కార‌ణం కావ‌చ్చు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. సినిమా నుంచి ఏదైతే ఆశించామో అది వ‌స్తుంది. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్…

Read more

‘మృత్యుంజ‌య్‌’ ఫిబ్ర‌వ‌రి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు ఎప్ప‌టిక‌ప్పుడు వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ వారి హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయ‌న తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ హుస్సేన్ షా కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ర‌మ్య గున్నం స‌మ‌ర్ప‌ణ‌లో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు. ‘మృత్యుంజయ్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు. పోస్ట‌ర్‌ను గ‌మ‌నిస్తే..పేప‌ర్ల‌తో నిండిన రోడ్డుపై నిల‌బ‌డిన శ్రీవిష్ణుని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ విజువ‌ల్స్ సినిమాపై మ‌రింత ఆస‌క్తిని…

Read more

‘ది రాజా సాబ్’ ఫిబ్ర‌వ‌రి 6 నుంచి జియో స్టార్‌లో స్ట్రీమింగ్‌

హైద‌రాబాద్‌, ఫిబ్ర‌వ‌రి 5: ప‌్ర‌ముఖ ఓటీటీ మాధ్య‌మం జియో స్టార్‌లో ది రాజా సాబ్ సినిమాను ఫిబ్ర‌వ‌రి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని సోష‌ల్ మీడియాలో జియో స్టార్ అనౌన్స్ చేసింది. భార‌త‌దేశంలో బిగ్గెస్ట్ సూప‌ర్‌స్టార్‌గా పేరున్న ప్ర‌భాస్ ఈ చిత్రంలో న‌టించారు. దీంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 6న స్ట్రీమింగ్ అవుతుంద‌నే అధికారిక ప్ర‌క‌ట‌న‌తో పాటు, జియో హాట్ స్టార్ కొత్త ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. హిప్నాటిక్ థ్రిల్ల‌ర్‌గా ఉత్కంఠ‌త‌ను పెంచే క‌థ‌తో సినిమా ప్రేక్ష‌కులను అంచ‌నాల‌ను పెంచుతోంది. ఎక్స్‌టెండెడ్ క‌ట్‌తో ది రాజా సాబ్‌ను రిలీజ్ చేస్త‌న్నామ‌నే ప్ర‌క‌ట‌న‌తో పాటు, ట్రైల‌ర్‌కు అభిమానుల నుంచి సూప‌ర్బ్…

Read more