Skip to content
“స్పిరిట్” మే 8న విడుదల Telugu News

ఇండియాలో మొదటిసారి ఒక రైతు దంపతులు నర్సమ్మ వెంకటేశ్వర్లు నిర్మించిన సినిమా “స్పిరిట్”

8th వండర్ సినిమా బ్యానర్ పై రవిబాబు సత్య ప్రకాష్, చిత్రం శీను, గడ్డం నవీన్, జూనియర్ రాజశేఖర్, సుజాత, మయూరి, డాలి నటీనటులుగా సిహెచ్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో ఒక గొర్రెలు కాచుకునే భార్య భర్తల అయిన చిన్నబోయిన రైతు నర్సమ్మ వెంకటేశ్వర్లు కలిసి నిర్మించిన చిత్రం స్పిరిట్. వీరికి చదువు రాకపోయినా ఆర్టిస్టులను పెట్టుకుని తన కొడుకుతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రం ఆడియో వేడుకను హైదరాబాదులో ఘనంగా విడుదల చేశారు ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు వి.సముద్ర, నటులు నిర్మాత అశోక్ కుమార్, నిర్మాత రామ్ దాస్ తదితరులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. అనంతరం నటుడు నిర్మాత అశోక్…

Read more
ఘనంగా అధికార ప్రదానోత్సవం Telugu News

ఘనంగా అధికార ప్రదానోత్సవం

మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో అధికార ప్రదానోత్సవం(ఇన్వెస్టిచర్‌ సెర్మనీ) కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. 2025–2026 ఏడాదికి సంబంధించి విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, అపోలో హాస్పిటల్‌ వైద్యురాలు జేబ కలీల్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ–‘‘విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. తల్లితండ్రులు ఆశలు, టీచర్లు ఆకాంక్షలను విద్యార్థులు నెరవేర్చాలి. అదేవిధంగా అంకితభావం, వినయం, విధేయత, సమాజానికి సేవ చేయడం వంటి అంశాలను కూడా అలవర్చుకోవాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య పాఠశాల మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి, డీన్‌ మల్లేష్,…

Read more