ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో సరికొత్త లేయర్స్ ఉన్న చిత్రం సఃకుటుంబానాం: దీక్షిత్ శెట్టి
హెచ్ ఎన్ జి సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఉదయ్ శర్మ రచన దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మాతలుగా నేడు ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సఃకుటుంబానాం. రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్రప్రసాద్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం తదితరులు కీలకపాత్రలో పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా మధు దాసరి డిఓపిగా పనిచేశారు. ఎడిటర్ గా శశాంక్ మలి చేశారు. నూతన సంవత్సర దినోత్సవ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రాన్ని చూసిన హీరో దీక్షిత్…
