మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతుల మీదుగా శ్రీ విష్ణు ‘మృత్యుంజయ్’ ట్రైలర్ విడుదల
ది కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు ప్రస్తుతం హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించిన ‘మృత్యుంజయ్’ అనే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ చిత్రాన్ని లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ హిట్ పెయిర్గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ సినిమాతో మరోసారి ఆడియెన్స్ని పలకరించనున్నారు. ‘మృత్యుంజయ్’ టీజర్కు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ చేసిన పాటకి కూడా యూట్యూబ్లో ఆదరణ దక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ను రిలీజ్ చేసిన అనంతరం ఎన్టీఆర్…
