దూరదర్శని అందరి మనసులను హత్తుకుంటుంది: దర్శకుడు కార్తికేయ కొమ్మి
సువిక్షిత్, గీతికా రతన్ జంటగా ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్గుడ్ లవ్ ఎంటర్టైనర్ 'దూరదర్శిని'. కలిపింది ఇద్దరిని ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో వారాహ మూవీ మేకర్స్ పతాకంపై జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని పనులను పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 15న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్రం దర్శకుడు కార్తికేయ కొమ్మి చిత్ర విశేషాలను పంచుకున్నారు. ఆ విశేషాలివి. మీ నేపథ్యం ఏమిటి? ఇంతకు ముందు నేను సాధ్యం, వసూల్ రాజా, లక్ష్మీబాంబ్ సినిమాలకు దర్శకత్వం చేశాను. నేను కొత్తవాళ్లతో చేసిన తొలి ప్రాజెక్ట్ ఇది. యదార్థ సంఘటనతో చాలా రియలిస్టిక్గా ఈ సినిమాను రూపొందించాను. దూరదర్శని కథ…
