Skip to content

జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజస్వి అడప నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు హీరో ఆకాష్ పూరి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ... జమాన ట్రైలర్ బాగుంది, చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, మంచి కాన్సెప్ట్ తో జనవరి 30న విడుదల కాబోతున్న ఈ మూవీని అందరూ థియేటర్స్ లో చూసి సక్సెస్ చెయ్యాలని కోరుకుంటున్నాను, క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తోన్న ఈ సినిమా అందరికి మంచి పేరు తెచ్చిపెట్టాలనుకున్తున్నాను అన్నారు…

Read more

శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’

శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభం డబ్బింగ్ కార్యక్రమాలలో పాల్గొననున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం కీలకమైన పోస్ట్‌ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తివంతమైన రచన, మాస్‌ మెచ్చే సంభాషణలకు పేరుగాంచిన హరీష్ శంకర్ ను అభిమానులు ముద్దుగా 'కల్ట్ కెప్టెన్' అని పిలుస్తారు. ఆ పేరుకి తగ్గట్టుగానే 'ఉస్తాద్ భగత్ సింగ్'ను కల్ట్ చిత్రంగా మలచడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను దర్శకుడు హరీష్ శంకర్ వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లేలా.. ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించే, ప్రేక్షకుల చేత ఈలలు వేయించే…

Read more

గణతంత్ర దినోత్సవం సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డుని అందుకున్న లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను లెజెండరీ యాక్టర్ డా. ఎం. మోహన్ బాబు అందుకున్నారు. గౌరవనీయులైన పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ప్రదానం చేశారు. తరువాత సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ సందడి చేశారు. ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ప్రభావం కనిపిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం ఓ ప్రత్యేక చరిత్రను సృష్టించినట్టుగా నిలిచింది…

Read more

హైదరాబాద్ లో ముత్యాలు – I పేరుతో ఆర్ట్ క్యాంప్‌

స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్ హైదరాబాద్ 24 నుండి 26 జనవరి 2026 వరకు 40 మంది కళాకారులతో 'హైదరాబాద్ పెరల్స్ -I (హైదరాబాద్ ముత్యాలు - I) ' పేరుతో ఆర్ట్ క్యాంప్‌ను నిర్వహిస్తోంది. ఈ కళా శిబిరాన్ని హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అధ్యక్షుడు మరియు ఆర్ట్ క్యాంపు క్యూరేటర్ అయిన ప్రముఖ శిల్పి M. V. రమణా రెడ్డి ప్రారంభించారు. సభికులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం కళాకారులను, కళాభిమానులను ఎంతో ఆకర్షిస్తుందని, ఇంకా ఎన్నో కళా కార్యక్రమాలు, కల శిబిరాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వివిధ కళా కార్యక్రమాల నిర్వహణ ద్వారా కళాకారులకు వేదిక కల్పిస్తుందని అభినందించారు. డాక్టర్ కే. లక్ష్మి ఐఏఎస్,…

Read more

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ భారీ పాన్ ఇండియా పీరియాడిక్ యాక్షన్ మూవీ “డేవిడ్ రెడ్డి” ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రోజు రిపబ్లిక్ డే సందర్భంగా "డేవిడ్ రెడ్డి" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ లాంఛ్ చేశారు. "డేవిడ్ రెడ్డి" ఫస్ట్ లుక్…

Read more

నాకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడం నా అదృష్టం, నా తెలుగు ప్రజల ఆశీర్వాదం – రాజేంద్ర ప్రసాద్

భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల పేర్లు విడుదల చేయడం జరిగింది. వారిలో ఒకరు మన తెలుగువారు నటకిరీటి రాజేంద్రప్రసాద్ గారు ఉండటం మనందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నుండి తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చి 1977లో స్నేహం అనే చిత్రంతో మొదలుకొని నేటి వరకు ఎన్నో చిత్రాలలో పాత్రలో పోషిస్తూ తనదైన గుర్తింపు పొందారు. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఈ విధంగా రాజేంద్రప్రసాద్ గారు స్పందించారు. "నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో…

Read more

నవదీప్: పాత్రలతోనే తన స్థాయిని నిరూపించుకుంటున్న నటుడు

నటుడు నవదీప్ పుట్టినరోజు సందర్భంగా, తెలుగు సినీ పరిశ్రమలో పాత్రాధారిత సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిన ఓ విశిష్ట నటుడిని స్మరించుకునే సందర్భమిది. కథను, పాత్రను ముందుంచే ఎంపికలతో, భయంలేని నటనతో తనదైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, నిలకడైన అభిరుచిగల నటుడిగా నవదీప్ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన తాజా చిత్రం ‘దండోరా’ లో నవదీప్ చేసిన పాత్ర ఆయన కెరీర్‌లోనే అత్యుత్తమ నటనలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది. భావోద్వేగ నియంత్రణ, సహజ నటన, అంతర్గత సంఘర్షణను ఆవిష్కరించిన తీరు కథకు బలంగా నిలిచింది. ఈ పాత్ర ద్వారా నటుడు కనిపించకుండా, పాత్ర మాత్రమే ప్రేక్షకుల ముందు నిలిచేలా చేశారు. ‘దండోరా’లో నవదీప్ నటనకు ప్రేక్షకులు, విమర్శకులు మంచి స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఇది…

Read more

‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు…

Read more

ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహవిష్కరణ

తానా సాహిత్య విభాగం - తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో మరియు అనకాపల్లి సిరివెన్నెల కళాపీఠం ఆధ్వర్యంలో అనకాపల్లి, గాంధీనగర్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన ఈరోజు ప్రముఖ సినీ గీత రచయిత పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కాంస్య విగ్రహావిష్కరణ సుప్రసిద్ధ సినీదర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చేతుల మీదగా మరియు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కుటుంబ సభ్యుల మధ్య విగ్రహ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అనంతరం పెంటకోట కన్వెన్షన్ లో శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ గారి అధ్యక్షతన శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మహోత్సవ సభ అత్యంత…

Read more