Skip to content

‘రూపాయనమ:’ అక్టోబర్ 2న సినిమా విడుదల

చిత్రవేద ప్రొడక్షన్స్ బ్యానర్ మీద పావని సాగి నిర్మాణంలో అరవింద్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘రూపాయనమ:’. ఈ సినిమాలో అరవింద్ పాండ్రేట్, వేణు పొల్సాని, డి. అనుదీప్, శ్రావణి మల్కని, క్రాక్ శ్రీమణి, విషాన్ శ్రీ, కావ్యశ్రీ మాదిశెట్టి ప్రధాన పాత్రలను పోషించారు. కోటి రూపాయల లాటరీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఫ్యామిలీ, కామెడీ అంశాలతో పాటుగా థ్రిల్లింగ్, సస్పెన్స్ అంశాల్ని కూడా జోడించారు. ఈ మూవీని అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తయింది. రెండు గంటల 13 నిమిషాల నిడివితో ఈ మూవీ రానుంది. ‘రూపాయనమ:’ సినిమాకి సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఫ్యామిలీ, సస్పెన్స్, హ్యూమర్ ఇలా అన్ని అంశాలను జోడించిన…

Read more

#KA13 వినాయక చవితి స్పెషల్ పోస్టర్‌ రిలీజ్

ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో సరికొత్త దశలోకి అడుగుపెడుతున్నారు. 'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం.. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి తొలిసారి నిర్మాతగా మారి జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే “Ek Dum Bindass Pakaane Waale” అనే…

Read more

“డేవిడ్ రెడ్డి” సినిమా నుంచి రమ్యకృష్ణ బర్త్ డే పోస్టర్ రిలీజ్

"డేవిడ్ రెడ్డి" చిత్రంలో కమల రెడ్డి పాత్రలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న రమ్యకృష్ణ 'రా కింగ్' మంచు మనోజ్ నటిస్తున్న కొత్త సినిమా "డేవిడ్ రెడ్డి". ఈ సినిమాను వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్స్ పై వెంకట్ రెడ్డి, భరత్ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి బ్యాక్ డ్రాప్ తో ఇంటెన్స్ యాక్షన్ డ్రామా కథతో భారీ పాన్ ఇండియా చిత్రంగా "డేవిడ్ రెడ్డి" సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మారియా ర్యబోషప్క హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో నటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ…

Read more

భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ అనౌన్స్ మెంట్

తన అమృత గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా శ్రోతలను దశాబ్దాల పాటు ఉర్రూతలూగించిన సంగీత సామ్రాజ్ఞి, గాయని భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించే భారీ ప్రయత్నం ప్రారంభించారు విజనరీ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్. ఈ ప్రెస్టీజియస్ మూవీలో ఎంఎస్ సుబ్బలక్ష్మిగా నేషనల్ క్రష్ రశ్మిక మందన్న నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ రోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీ వేదికగా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ ఘనంగా చేశారు. తన నట ప్రతిభతో దేశవ్యాప్తంగా…

Read more

నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ‘లీసా’

ఓం సాయిరామ్ ఆర్ట్స్, ఐరాస్ (IRAHS) ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ దుగ్గిరెడ్డి, రామకృష్ణ ఐల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘లీసా’. విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలైన నటి అనన్య నాగళ్ల ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. జవహర్ పవార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు రాని విధంగా రెండు భిన్నమైన జోనర్లను సరికొత్త పద్ధతిలో మేళవించి ‘లీసా’ కథను రూపొందించారు. తాజాగా ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయ్యారు మెలొడీ బ్రహ్మ మణిశర్మ. స్క్రిప్ట్ విని ఇంప్రెస్ అయిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వ బాధ్యతలు వహించేందుకు ముందుకొచ్చారు. ఆయన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది…

Read more

శ్రీ విష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ 2027 సంక్రాంతికి రిలీజ్

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తనకు బాగా సూటయ్యే కథలను ఎంచుకుంటూ తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా మరో ఆసక్తికరమైన ఎంటర్‌టైనర్‌తో వస్తున్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో, ప్రముఖ పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తుండగా, అనిల్ యెర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘సామజవరగమన’ తర్వాత శ్రీ విష్ణు, రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అంతేకాదు, రామ్ అబ్బరాజు గత బ్లాక్‌బస్టర్ నారి నారి నడుమ మురారి’లో శ్రీ విష్ణు క్యామియో రోల్‌లో కనిపించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన సాక్షి మధోల్కర్ హీరోయిన్‌గా…

Read more

సిద్ధు జొన్నలగడ్డ లాంచ్ చేసిన ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌

‘డీజే టిల్లు’తో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన విమల్ కృష్ణ.. మరో క్విర్కీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్ మయూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా.. హ్యూమర్, క్యారెక్టర్స్, కథనంలో పూర్తిగా డిఫరెంట్ గా ఉండబోతోంది. చిలక ప్రొడక్షన్స్ సమర్పణలో రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాగ్ మయూర్ సరసన మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రతి విషయాన్నీ అతిగా ఆలోచించే సన్నీ.. తన చుట్టూ జరిగే దాదాపు ప్రతిదాంట్లోనూ ఏదో అనుమానాస్పదమైన విషయం…

Read more

“మిస్సింగ్ మేఘన” 18న విడుదల

ఫస్ట్ కాపి మూవీస్, కేడి&కో బ్యానర్ పై పంచుమర్తి నరేష్ బాబు ప్రొడ్యూసర్ గా, వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, వైదిక సెంజాలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రలో గోపరాజు రమణ, వెంప కాశి, కౌశిక్, మహిపాల్, రుచిత, నళిని, శ్రీనివాస్, అజీమ్, పండు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్న చిత్రం మిస్సింగ్ మేఘన. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ రివీలింగ్ పోస్టర్ లాంచ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి. వి. వినాయక్ గారు, ఫస్ట్ సింగిల్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారి చేతుల మీదుగా జరిగింది. శామ్. కె. నాయుడు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి ఆర్.ఆర్. ధృవన్ సంగీతం…

Read more

‘శ్రీ కేసరి నందన్’ 7 భాషల్లో ఘనంగా విడుదల

అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ గుజరాతీ సినిమాకు ఒక సువర్ణ అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది. అతుల్ ఇండియా మూవీస్ మొట్టమొదటి గుజరాతీ పాన్-ఇండియా చిత్రం 'శ్రీ కేసరి నందన్'ను ప్రకటించింది: 2027 రామనవమి నాడు 7 భాషల్లో ఘనంగా విడుదల. అతుల్ ఇండియా మూవీస్ నిర్మించి, అతుల్ ఎం. బోసమియా సమర్పించిన 'శ్రీ కేసరి నందన్', గుజరాతీ చిత్ర పరిశ్రమ నుండి మొట్టమొదటి పాన్-ఇండియా చిత్రంగా చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్…

Read more

‘ఫీల్ మై లవ్’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల

శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ మీద ఏ.ఎన్. బాలాజీ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌ చిత్రం ‘ఫీల్ మై లవ్’ . ఈ సినిమాలో ఆదిత్య భాస్కర్, ఐరా, అమ్ము అభిరామి,మధుసుదన్ రావు, రాజయ్యప్ప, నోబెల్ జేమ్స్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీకి హరి ప్రకాష్ ఎం రచన, దర్శకత్వం వహించారు. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, యూత్‌కి నచ్చే కంటెంట్‌తో ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా వినాయక చవితి సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ పోస్టర్‌లో సినిమాలోని ప్రధాన పాత్రలన్నింటినీ చూపించారు. ఇక త్వరలోనే ఆడియో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది…

Read more