హైదరాబాద్: సినిమా తెరపై కనిపించే ప్రతి అక్షరానికి ఒక జీవం ఉంటే, ఆ జీవానికి రూపం…
వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ ప్రారంభం

వైల్డ్ వాటర్స్లో భారతదేశంలో తొలిసారిగా వాటర్ & అమ్యూజ్మెంట్ పార్క్లో ఇమర్సివ్ 360° డోమ్ సమ్మర్ ఫెస్ట్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా చేతుల మీదుగా శంకరపల్లి లో ప్రారంభం
వైల్డ్ వాటర్స్ – వాటర్ & అమ్యూజ్మెంట్ థీమ్ పార్క్ తన ఇమర్సివ్ 360° డోమ్ అనుభవాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ డోమ్ను ప్రముఖ నటి ఫారియా అబ్దుల్లా (జాతి రత్నాలు) అధికారికంగా ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో ఏండి కిలారు సందీప్ మరియు కిలారు అదితి పాల్గొన్నారు.
కృష్ణ సందీప్ కిలారు మరియు స్వాతి కిలారు స్థాపించిన వైల్డ్ వాటర్స్, గత 9 సంవత్సరాలుగా ప్రతి సీజన్లో కొత్త వినోదాలను అందిస్తూ హైదరాబాద్లో ప్రముఖ వినోద కేంద్రంగా ఎదిగింది.
ఈ సందర్బంగా ఎండి కిలారు స్వాతి మాట్లాడుతూ….
ఈ డోమ్లో గోడలు మరియు పైకప్పు మొత్తం ఒకే స్క్రీన్లా పనిచేస్తూ, సరౌండ్ సౌండ్తో కలిసి సందర్శకులకు పూర్తి ఇమర్సివ్ అనుభవాన్ని అందిస్తుంది. చుట్టూ కనిపించే విజువల్స్ ద్వారా, సందర్శకులు నిజంగా ఆ అనుభవంలో ఉన్నట్టు భావిస్తారు. రోజంతా వివిధ షోలు ప్రదర్శించబడతాయి. ఏప్రిల్ 18 నుండి జూన్ 14, 2026 వరకు వైల్డ్ వాటర్స్ సమ్మర్ ఫెస్ట్ నిర్వహించనుందని తెలిపారు.
కిలారు అదితి మాట్లాడుతూ….
ఈ కొత్త ఆకర్షణలతో, వైల్డ్ వాటర్స్ సాంకేతికత, వినోదం, కుటుంబానికి అనుకూలమైన అనుభవాలను కలిపి పూర్తి రోజంతా వినోదాన్ని అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోందని తెలిపారు
ఒకే టికెట్తో సందర్శకులు ఆస్వాదించగల వినోదాలు:
● 50కి పైగా వాటర్ & అమ్యూజ్మెంట్ రైడ్స్
● లైవ్ డాన్స్ షోలు & DJ ప్రోగ్రామ్స్
● వేవ్ పూల్ అనుభవం
● మ్యాజిక్ షోలు
● విభిన్న రకాల ఆహార వసతులు
ఈ సంవత్సరం ప్రత్యేకంగా DJ ఫోమ్ పార్టీను కూడా ప్రవేశపెట్టారు, ఇది వేసవిలో సందర్శకులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుంది.





