హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది…
‘ది ఇండియా స్టోరీ’ కొత్త పోస్టర్ రిలీజ్
కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ది ఇండియా స్టోరీ’ నుంచి మేకర్స్ మరో పవర్ఫుల్ పోస్టర్ను విడుదల చేశారు. దేశంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న పెస్టిసైడ్ వ్యవసాయం అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్న ఈ పోస్టర్, సినిమా చెప్పబోయే బలమైన సందేశాన్ని మరోసారి హైలైట్ చేస్తోంది. మనం ప్రతిరోజూ తినే ఆహారం వెనుక దాగి ఉన్న ప్రమాదాలను ఆలోచింపజేసేలా ఈ పోస్టర్ను డిజైన్ చేశారు.
కొత్తగా విడుదలైన పోస్టర్లో పెస్టిసైడ్స్ అధికంగా ఉపయోగించడం వల్ల ఆహార భద్రత, ప్రజారోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని బలంగా చూపించారు. ఆలోచింపజేసే విజువల్ డిజైన్తో రూపొందిన ఈ పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. సమాజానికి ఎంతో కీలకమైన అంశాన్ని ఎమోషనల్, థ్రిల్లింగ్ కథతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఈ సినిమా సిద్ధమవుతోంది. కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేస్తున్న సమస్యపై అవగాహన కల్పించడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.
సినిమా గురించి కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. “‘ది ఇండియా స్టోరీ’ ప్రతి కుటుంబం చూడాల్సిన సినిమా. మన రోజువారీ జీవితాలను నేరుగా ప్రభావితం చేసే అంశాన్ని ఎంతో ధైర్యంగా ఈ సినిమా ప్రస్తావించింది. మనం తినే ఆహారం గురించి, తీసుకునే నిర్ణయాల గురించి ప్రేక్షకులు మరింత లోతుగా ఆలోచించేలా ఈ సినిమా ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను”
శ్రేయాస్ తల్పాడే మాట్లాడుతూ.. “ఇది కేవలం వ్యవసాయం గురించి చెప్పే కథ కాదు. రాబోయే తరాల ఆరోగ్యం, భవిష్యత్తు గురించి చెప్పే కథ. ఈ కొత్త పోస్టర్ సినిమాలో మేము చెప్పబోయే అత్యవసరమైన అంశాన్ని ప్రతిబింబిస్తుంది. సమాజంలో అర్థవంతమైన చర్చకు దారితీసే ప్రాజెక్ట్లో భాగం కావాలని అనుకున్నాం. ప్రేక్షకుల్లో అవగాహన తీసుకురాగల శక్తి ‘ది ఇండియా స్టోరీ’కి ఉందని నేను నమ్ముతున్నాను”
పెస్టిసైడ్ వ్యవసాయం వల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే తీవ్ర ప్రభావాలను ప్రధానాంశంగా తీసుకున్న ‘ది ఇండియా స్టోరీ’ ఇప్పటికే మంచి చర్చకు దారి తీసింది. ప్రస్తుతం మాత్రమే కాకుండా, భావితరాల ఆరోగ్యంపై కూడా ఈ వ్యవసాయ విధానాలు ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సినిమా ప్రశ్నించనుంది. మన ప్లేట్లోకి చేరే ఆహారం ఎంత సురక్షితమనే అంశంపై ప్రేక్షకులను ఆలోచింపజేస్తూ, ఆహార భద్రత, ప్రజారోగ్యంపై అవగాహన పెంచే ప్రయత్నం చేస్తోంది.
జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి చేతన్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సాగర్ బి. షిండే కథ, నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ఈ చిత్రం 2026 జులై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రానికి స్వాతి వినాయక్ సైందానే, అనితా జాధవ్, వినాయక్ సైందానే, కల్పేష్ షా, దేవయాని ఖోరాటే, ప్రేమ్ జోషి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మంగేష్ ధాక్డే సంగీతం సమకూరుస్తున్నారు. ఆశిష్ మత్రే ఎడిటింగ్, షకీల్ అజ్మీ సాహిత్యం, అన్మోల్ భావే సౌండ్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. బలమైన సందేశం, సమాజానికి సంబంధించిన కీలక అంశంతో ‘ది ఇండియా స్టోరీ’ విడుదలకు ముందే మంచి అంచనాలను నెలకొల్పింది.

