మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్బస్టర్ విజయంపై చిరంజీవి గారి ఎమోషనల్ మెసేజ్
ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ సాధించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రం ఘన విజయం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు. అత్యంత వేగంగా 300 కోట్ల మార్క్ను చేరిన తెలుగు చిత్రంగా మన శంకర వర ప్రసాద్ గారు ఘనత సాధించింది. ఈ చిత్రం ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్కును కూడా అధిగమించి, చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 8వ రోజు అద్భుతమైన వసూళ్లు నమోదు చేసి, భారీ బుకింగ్లతో 9వ రోజున మరింత జోరుని కొనసాగుస్తోంది. ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టిన ఈ చిత్రం, ఇప్పుడు మరిన్ని మైలురాళ్ల దిశగా…
