Skip to content

‘బకాసుర రెస్టారెంట్‌’ అందరూ కుటుంబంతో కలిసి చూడదగ్గ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌: నటుడు ప్రవీణ్‌

వినోదంతో పాటు ఎమోషన్‌ను మేళవించి.. ప్రేక్షకులను రెండున్నర గంటలు ఎంటర్‌టైన్‌ చేయడమే ధ్యేయంగా రూపొందిన చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌' ఈ సినిమా చూసిన వాళ్లకు ఓ మంచి విందు భోజనం ఆరగించిన ఫీల్‌ కలగబోతుందని చెబుతోంది చిత్ర టీమ్‌. తన నటనతో, డైలాగ్‌ డెలివరితో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాందించుకున్న క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌, కమెడియన్‌ ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌', ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హంగర్‌…

Read more

‘ఇస్కితడి ఉస్కితడి’‌తో అదరగొట్టేసిన ఉదయభాను

వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్, కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిదాల నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన పాటలు ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఓ మాస్ నంబర్‌ను వదిలారు. ఈ స్పెషల్ సాంగ్‌లో ఉదయ భాను అందరినీ ఆకట్టుకున్నారు. "ఇస్కితడి ఉస్కితడి" అంటూ సాగే ఈ పాటను రఘు రామ్ రచించారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ పాట అందులోనూ…

Read more

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మొదటి గీతం ‘ఫైర్‌ స్టార్మ్’ విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర ఓజాస్‌ గంభీరగా అలరించనున్న చిత్రం 'ఓజీ' (They Call Him OG). పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి మొదటి గీతం 'ఫైర్‌ స్టార్మ్' విడుదలైంది. ఈ గీతం నిజంగానే ఓ అగ్ని తుఫానులా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఓజీ' చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీకరమైన గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి ప్రముఖ నటీనటులు…

Read more

నేషనల్ అవార్డ్స్ ఇచ్చిన గౌరవంతో మరింత బాధ్యతగా మంచి సినిమాలు చేస్తాం – “బేబి” మూవీ టీమ్

ప్రతిష్టాత్మక 71 జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా రెండు నేషనల్ అవార్డ్స్ గెల్చుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ లో "బేబి" మూవీ టీమ్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని జాతీయ అవార్డ్స్ పొందిన సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎడిటర్ విప్లవ్ మాట్లాడుతూ - "బేబి" సినిమాకు రెండు నేషనల్ అవార్డ్స్ రావడం సంతోషంగా ఉంది. సాయి రాజేశ్ గారికి వరుసగా రెండోసారి జాతీయ పురస్కారం వచ్చింది. రోహిత్, సాయి రాజేశ్ గారికి కంగ్రాట్స్…

Read more

‘మదరాసి’ నుంచి సెలవిక కన్నమ్మా రిలీజ్

వెరీ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ ఇద్దరూ తొలిసారి కలిసి చేస్తున్న సినిమా మదరాసి. అద్భుతమైన థ్రిల్‌ తో పాటు మాస్ ఎంటర్టైనర్స్‌కి కొత్త డైమెన్షన్ ఇచ్చేలా ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ లక్ష్మీ మూవీస్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణీ వసంత ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదలైన టైటిల్ గ్లిమ్స్‌ భారీ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి రాకింగ్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఫస్ట్ సింగిల్ సెలవిక కన్నమ్మా తో మ్యూజికల్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారు. టీజర్ యాక్షన్ ప్యాక్డ్‌గా ఉండగా, ఈ పాట మాత్రం వెరీ డిఫరెంట్…

Read more

యూకే సినీప్లెక్స్ నాచారంలో ప్రారంభం

హైదరాబాద్‌లో ఉన్న అత్యంత విలాసవంతమైన అనుభవానికి.. వినోదానికి మరో చిరునామా చేరింది... అదే యూకే సినీ ప్లెక్స్‌. హైదరాబాద్‌లోని నాచారంలో అత్యంత ప్రతిషాత్మకంగా నిర్మించిన ఈ యూకే సినీ ప్లెక్స్‌ను బుధవారం ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, సునీల్‌ నారంగ్‌, భరత్‌ నారంగ్‌, శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈసందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ యూకే సినీప్లెక్స్‌ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ ఎంతో ఉన్నతంగా ఉంది. సౌండ్‌ సిస్టమ్‌, స్క్రీన్‌, సీట్లు ఎంతో బాగున్నాయి. ఉప్పల్‌, హబ్సిగూడ, నాచారంలో ఉండేవారికి ఈ మల్టీప్లెక్స్‌ వినోదాన్ని పంచడంలో సరికొత్త ఎక్స్‌ పీరియన్ష్‌ ఇస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో శ్రీమతి పృతికా ఉదయ్ , శ్రీ రుషిల్ ఉదయ్‌లతో…

Read more

మత్స్యకారుల బతుకుపోరాటం: ‘అరేబియా కడలి’

కొన్ని కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి. మరికొన్ని తెరపై చూస్తే మనసును కదిలిస్తాయి. అలాంటి ఒక బలమైన కథతో వస్తున్నారు సత్యదేవ్! ఆయన నటించిన ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ 'అరేబియా కడలి' ట్రైలర్ తాజాగా విడుదలై, సినీ ప్రియుల్లో చర్చకు దారితీసింది. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో, వి. వి. సూర్య కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్, సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించనుంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్ వివరంగా చూపించనుంది. https://youtu.be/sOD5wwC1kGw?si=C5TOErgeYmy2VQGV ట్రైలర్లో కనిపించిన దృశ్యాలు, సంభాషణలు, నేపథ్య సంగీతం సిరీస్కు హై-ఇంటెన్సిటీ డ్రామాను అందిస్తున్నాయి…

Read more

మిత్ర మండలి’ నుంచి ‘స్వేచ్ఛ స్టాండు’ విడుదల

'కత్తందుకో జానకి' శైలిలో 'మిత్ర మండలి' నుంచి మరో సరదా గీతం 'స్వేచ్ఛ స్టాండు' ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ స్థాపించిన నిర్మాణ సంస్థ బి.వి. వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మిత్ర మండలి'. అభిరుచి గల నిర్మాతలు కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సోషల్ మీడియా సంచలనం నిహారిక ఎన్.ఎం. తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు విజయేందర్ ఎస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, 'కత్తందుకో జానకి' గీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా…

Read more

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు శ్రీ అనిల్ రావిపూడి, నిర్మాతలు శ్రీ సాహు గారపాటి, శ్రీ హరీష్ పెద్దిలకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు శ్రీ ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా శ్రీ నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితగా శ్రీ కాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడుగా శ్రీ పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ),…

Read more

జాతీయ అవార్డ్స్ లో సత్తాచాటిన “బేబి” మూవీ. ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్, ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీల్లో అవార్డ్స్ సొంతం చేసుకున్న కల్ట్ బ్లాక్ బస్టర్

నేడు ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ లో "బేబి" సినిమా సత్తాచాటింది. ఈ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సాయి రాజేశ్, ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ గా పీవీఎన్ ఎస్ రోహిత్(ప్రేమిస్తున్నా పాటకు) అవార్డ్ గెల్చుకున్నారు. "బేబి" సినిమాకు సాయి రాజేశ్ రాసిన హృద్యమైన కథనం జాతీయ స్థాయిలో పురస్కారం సాధించింది. అలాగే ఈ చిత్రంలో ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ పీవీఎన్ ఎస్ రోహిత్ ప్రతిభను నేషనల్ అవార్డ్ వరించింది. "బేబి" సినిమాకు సైమా, గామా, ఫిలింఫేర్ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డ్స్ దక్కగా...ఈ రోజు ప్రకటించిన రెండు జాతీయ అవార్డ్స్ అత్యున్నత గౌరవాన్ని అందించాయి. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి…

Read more