Skip to content

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశమైన భరత్ భూషణ్

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు, అలాగే ఇతర ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోని కీలక సభ్యులతో ఆంధ్రప్రదేశ్ ఎఫ్ డి సి చైర్మన్ భరత్ భూషణ్ గారు, ఏపీ ఎఫ్డిసి ఎండి విశ్వనాథన్ గారితో కలిసి కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దిశగా చర్చించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా APSFTVTDC చైర్మన్ భరత్ భూషణ్ గారు మాట్లాడుతూ... "ఆంధ్రప్రదేశ్ లో సినీ రంగం అభివృద్ధి చెందే విధంగా, ముఖ్యంగా సినిమా షూటింగులు గురించి ప్రభుత్వ అధికారులు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో సినిమాలకు సంబంధించిన షూటింగులు, వాటి పర్మిషన్లు త్వరగా అందేలా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో…

Read more

అస్సాం వరద బాధితులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్

స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవరామ తారకం గారి శతజయంతి సందర్భంగా ప్రారంభించిన నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అస్సాం వరద బాధితులకు నిత్యవసర వస్తువులు పంపించడం జరిగింది. భారీ వర్షాల వల్ల కలిగి వరదలలో చిక్కుకుని ఎంతో నష్టపోయిన మన దేశంలోని మన రాష్ట్రమేనా అస్సాం రాష్ట్ర ప్రజలకు అండగా నిలబడాలని ఈ ట్రస్ట్ ద్వారా ఇక తెలుగు రాష్ట్రాల నుండి నిత్యవసర వస్తువులను ప్రజల నుండి స్వచ్ఛందంగా స్వీకరించి ఆ నిత్యవసర వస్తువులను నేడు అస్సాం వరద బాధితులకు ఒక ఎన్జీవో సంస్థ (THE EMBRYOS) ద్వారా అందచేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, ఖమ్మంతో పాటు ఇతర…

Read more

అస్సాం వరద బాధితులకు అండగా నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్..

అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి తీవ్రంగా మారింది. వరదల వల్ల ఇప్పటివరకు 75 మంది మృతి చెందగా, 7 జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆహారం, తాగునీరు, మందులు వంటి కనీస అవసరాలు కూడా అందక వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వరద బాధితులకు సహాయం అందించేందుకు నందమూరి బసవరామ తారకం ఎన్టీఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. బాధితుల కోసం బట్టలు, దుప్పట్లు, చెప్పులు, డ్రై ఫుడ్స్, బియ్యం, తాగునీరు, సానిటరీ ప్యాక్స్ వంటి నిత్యావసర వస్తువులను అందించి తమ వంతు సహాయం చేయాలని అభిమానులు, ప్రజలకు ట్రస్ట్ విజ్ఞప్తి చేసింది. ఈ సహాయ కార్యక్రమంలో నందమూరి మోహన రూప, తుమ్మల…

Read more

‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

అన్నదాన కార్యక్రమంతో మొదలైన 'నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనుంది : ట్రస్టీ చైర్మన్ నందమూరి మోహనకృష్ణ గారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి నందమూరి బసవతారకం గారి శతజయంతి సందర్భంగా నేడు ఆ కుటుంబ సభ్యులు ఆమె పేరుతో 'నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆమె జయంతి సందర్భంగా వేడుకలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులు వహిస్తూ చైర్మన్ గా నందమూరి…

Read more

రాజమౌళి, మహేష్ బాబు, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా నా డ్రీమ్ టైటిల్‌ను స్వచ్చందంగా ఇచ్చేశాను – దర్శకుడు సుబ్బారెడ్డి

దర్శకుడు సుబ్బారెడ్డి తన వద్ద రిజిస్టర్ అయిన 'వారణాసి' సినిమా టైటిల్‌ను దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రానికి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం మాజీ అధ్యక్షుడు వీరశంకర్, దర్శకుడు సుబ్బారెడ్డి కలిసి ఇంటర్వ్యూలో చర్చించారు. దర్శకుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2023లో 'వారణాసి' టైటిల్‌ను తన బ్యానర్‌పై రిజిస్టర్ చేసుకుని ఆ కథపై పని ప్రారంభించానని తెలిపారు. అయితే అదే టైటిల్ రాజమౌళి సినిమా కోసం అవసరమైందని తెలిసిన తర్వాత, తెలుగు సినిమా గౌరవం దృష్ట్యా ఎలాంటి సందేహం లేకుండా ఇవ్వాలని నిర్ణయించుకున్నానన్నారు. తన అభిమాన హీరో మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి, నిర్మాత…

Read more

అంగన్వాడి చిన్నారులకు నందమూరి జానకిరామ్ ట్రస్ట్ చేయూత

పిల్లల చిరునవ్వే సమాజానికి నిజమైన సంపద "అనే గొప్ప భావనతో, కొండకల్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారుల కోసం నందమూరి జానకిరామ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించబడింది. అంగన్వాడి టీచర్ల విజ్ఞప్తి మేరకు చిన్నారుల సౌకర్యార్థం కుర్చీలు అందజేయడంతో పాటు, వారి ఆరోగ్యం, ఆనందాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రేమతో చిరు కానుకగా డ్రై ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. పిల్లలు దైవ స్వరూపులు..వారి చిరునవ్వుల్లోనే దేవుడి ఆశీర్వాదం కనిపిస్తుంది.చిన్నారుల భవిష్యత్తు బలంగా ఉండాలంటే వారికి మెరుగైన విద్య, మంచి ఆరోగ్యం, సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. వారి కోసం చేసే ప్రతి చిన్న సేవ భవిష్యత్తు భారత నిర్మాణానికి వేసే ఒక గొప్ప అడుగు. ఈ…

Read more

నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు చొరవతో ముగిసిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదం

గత కొన్ని రోజులగా డాన్సర్ అసోసియేషన్ వివాదం గురించి వింటూనే ఉన్నాము. కాగా నేడు ఈ వివాదం పై ఒక సుదీర్ఘ చర్చ జరిగింది. జానీ మాస్టర్ గారు, డాన్సర్స్ ప్రెసిడెంట్ సుమలత గారితో ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని గారు, డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి సాయి రాజేష్ గారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి చదలవాడ శ్రీనివాసరావు గారు, తుమ్మల ప్రసన్నకుమార్ గారు చర్చలు జరిపిన తర్వాత మీడియా వారితో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా అనిల్ వల్లభనేని మాట్లాడుతూ... "డాన్సర్స్ అసోసియేషన్ లో ఇటీవల్ కొన్ని ఘటనలు జరిగాయి. ఈ ఘటనలపై మీడియాలో పలు చర్చిలు రావడం జరిగింది. ఆ చర్చలకు ముగింపు పలికే దిశగా ఫెడరేషన్ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది…

Read more

డిజిటల్‌లోనూ అఖండ రికార్డు

మాస్ ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకుని వరుస బ్లాక్‌బస్టర్లు అందించిన దర్శకుడు బోయపాటి శ్రీను. పవర్‌ఫుల్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో ఎలివేషన్స్‌ను తనదైన శైలిలో చూపిస్తూ 'భద్ర', 'సింహ', 'లెజెండ్', 'సరైనోడు', 'అఖండ' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు. ఎంతోమంది కొత్త ఆర్టిస్టులకు అవకాశాలు కల్పించిన దర్శకుడిగానూ ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు థియేటర్లలోనే కాదు, డిజిటల్ వేదికపైనా బోయపాటి తన సత్తా చాటారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'జయ జానకి నాయక' హిందీ డబ్బింగ్ వెర్షన్ 'ఖూంఖార్' యూట్యూబ్‌లో ఏకంగా 1 బిలియన్ వ్యూస్ సాధించి అరుదైన రికార్డు నెలకొల్పింది. 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న తొలి సినిమాగా నిలిచింది. ఈ…

Read more

ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం స్థలాలు కేటాయించలేదు- ఏపీ ఎఫ్.డి.సి డైరెక్టర్, దర్శకుడు సముద్ర

ఆంధ్రప్రదేశ్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ యూనియన్లు చేసే వసూళ్ళ కార్యకలాపాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని దర్శకుడు సముద్ర స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం హౌసింగ్ సొసైటీకి ఎలాంటి స్థలాన్ని కేటాయించలేదని ఆయన తెలిపారు. ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీకి ఏపీ ప్రభుత్వం స్థలాలు ఇచ్చారని, డబ్బులు తీసుకుంటున్నారని కొందరు మిత్రులు తనకు ఫోనులు చేసి ఎంక్వయిరీ చేయడం వల్ల అందరికీ వివరణ ఇవ్వటం కోసం ఈ ప్రకటన ఇస్తున్నానని సముద్ర తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఏపీ ఎఫ్.డి.సి కమిటీ చాలా అద్భుతంగా ఉందని, చిత్రసీమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం లేదా ఏపీ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ పేరుతో కొందరు వ్యక్తులు డబ్బులు…

Read more

హృదయాలను తాకే భావోద్వేగ చిత్రం ‘గాసిప్’

ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజానిజాలు తెలుసుకోకుండా పుకార్లను నమ్మడం ఎంత ప్రమాదకరమో తెలియజేసే చిత్రమే ‘గాసిప్’. దర్శకుడు వైభవ్ కౌండిన్య సమాజంలో ప్రతి ఒక్కరికీ సంబంధించిన అంశాన్ని ఎంచుకుని, ఆలోచింపజేసే విధంగా తెరకెక్కించారు. అజంతా (రాశి సింగ్) జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన ఎలా పెద్ద గాసిప్‌గా మారి ఆమె కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే అంశాన్ని సినిమా ప్రధానంగా చూపిస్తుంది. కథలోని భావోద్వేగాలు, పాత్రల సహజత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రాశి సింగ్ తన పాత్రలో అద్భుతంగా నటించి సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన ప్రేక్షకులను కదిలిస్తుంది. మహేష్ యడ్లపల్లి, రవి వర్మ, విజయ్ అదిరాజు తమ పాత్రలకు పూర్తి న్యాయం…

Read more