Skip to content
రోహిత్ నారా కొత్త సినిమా #RN23 పూజా కార్యక్రమాలతో ప్రారంభం Telugu News

రోహిత్ నారా కొత్త సినిమా #RN23 పూజా కార్యక్రమాలతో ప్రారంభం

హీరో రోహిత్ నారా తన తదుపరి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కరణ్ C ప్రొడక్షన్స్ LLP తో కలిసి ఆయన చేస్తున్న ఈ కొత్త చిత్రం బ్యానర్‌కి ప్రొడక్షన్ నెం.5గా రూపొందుతోంది. #RN23 ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీగా, ఆకట్టుకునే కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను అలరించనుంది. భరత్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ చినిమిల్లి మణికుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో పాటు పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముహూర్తపు షాట్‌కు కొరటాల శివ క్లాప్ కొట్టి, మేకర్స్ కు స్క్రిప్ట్‌ను అందజేసి చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. మావెరిక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు…

Read more
ఘనంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ విందు Telugu News

ఘనంగా నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రన్ వివాహ విందు

ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ – క్రిష్ ల వివాహం ఇటీవలే బెంగళూరులో వైభవంగా జరిగింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా వివాహ విందు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రవితేజ, అమల, నాగచైతన్య, శోభిత, సమంత తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

Read more
వాలా Ⅱ’ తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి: తేజ సజ్జా Telugu News

వాలా Ⅱ’ తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావాలి: తేజ సజ్జా

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం 'వాలా Ⅱ' ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. సాహు గారపాటి తన 'షైన్ స్క్రీన్స్' బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల గ్రాస్ వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘వాలా 2’ తెలుగులో నెల 24న థియేటర్లలో విడుదల కానుంది…

Read more
చిరంజీవిని కలిసి వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ Telugu News

చిరంజీవిని కలిసి వివాహానికి ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మెగాస్టార్ చిరంజీవి గారిని కలసి తన వివాహానికి ఆహ్వానించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వివాహ పత్రికను అందించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కావ్య రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవలే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య రెడ్డి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వీరి వివాహ వేడుక ఏప్రిల్ 29న దివ్యమైన తిరుమలలో జరగనుంది. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం, వారి జీవితంలోని ఈ ప్రత్యేకమైన కలయికకు అపూర్వ వేదికగా నిలుస్తుంది.

Read more
‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్ Telugu News

‘గోదారి గట్టుపైన’ సినిమా నుంచి నేను నా పల్లెటూరు సాంగ్ రిలీజ్

యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా 'గోదారి గట్టుపైన' తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ రోజు మేకర్స్ ‘గోదారి గట్టుపైన' నుంచి 'నేను నా పల్లెటూరు’ పాటను విడుదల చేశారు. పాట వినగానే అందమైన పల్లె జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. నాగ వంశీ కృష్ణ స్వరపరిచిన ఈ మెలోడీ పల్లెటూరి మట్టి వాసన, గోదావరి తీరాల అందంని అద్భుతంగా ప్రజెంట్ చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన పదాలు పల్లెటూరి ఆత్మని హత్తుకునేలా చూపిస్తున్నాయి. ఎంఎల్‌ఆర్ కార్తికేయ వోకల్స్…

Read more
‘జెట్లీ’ సినిమా  కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది:  డైరెక్టర్ రితేష్ రానా Telugu News

‘జెట్లీ’ సినిమా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: డైరెక్టర్ రితేష్ రానా

మైత్రి మూవీ మేకర్స్ ప్రజెంట్స్- సత్య, రితేష్ రాణా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ 'జెట్లీ' అన్‌లిమిటెడ్ ఫన్, స్టైలిష్ యాక్షన్‌ ట్రైలర్ లాంచ్ కామెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్య, ఇప్పుడు హీరోగా దర్శకుడు రితేష్ రానాతో మళ్లీ జతకట్టి చేస్తున్న చిత్రం ‘జెట్‌లీ’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మరోసారి క్విర్కీ, డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందని ప్రామిస్ చేస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. మే 1న సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ కథలో సత్య పోషిస్తున్న పాత్ర ప్రత్యేకంగా నిలుస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వ్యక్తిగా, తనను తాను…

Read more
‘స్వయంభూ ‘  నుంచి   ‘రా రా ధీవర’  పాట  16న రిలీజ్ Telugu News

‘స్వయంభూ ‘ నుంచి ‘రా రా ధీవర’ పాట 16న రిలీజ్

'కార్తికేయ 2'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ, ఇప్పుడు తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'స్వయంభూ'తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో, పిక్సెల్ స్టూడియోస్‌ భువన్, శ్రీకర్‌ నిర్మాణంతో, టాగోర్ మధు సమర్పణలో రూపొందిన ఈ చిత్రాన్ని ఒక భారీ చారిత్రక యాక్షన్ చిత్రంగా తీర్చిదిద్దారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ 'రా రా ధీవర' ఏప్రిల్ 16న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ఒక పవర్‌ఫుల్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్‌లో నిఖిల్ ఒక యోధుడి అవతారంలో, దట్టమైన అడవిలో నిలబడి, ఈటెను విసరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించారు. ఈ పాట ఎంత గ్రాండ్‌గా, అద్భుతంగా, కళ్లు చెదిరేలా…

Read more
‘పాపం ప్రతాప్’  సినిమా పెద్ద హిట్ కావాలి:  హీరో అల్లరి నరేష్ Telugu News

‘పాపం ప్రతాప్’ సినిమా పెద్ద హిట్ కావాలి: హీరో అల్లరి నరేష్

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్‌ రెడ్డి గడ్డం, రుద్రదేవ్‌ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్ బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌‌ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి రీసెంట్‌గా రిలీజైన టీజర్‌,సాంగ్స్ కు మంచి అప్లాజ్ వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ వేడుకు గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.…

Read more
‘ది ప్యారడైజ్’ లో సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్ Telugu News

‘ది ప్యారడైజ్’ లో సుబ్బలక్ష్మి గా కయాదు లోహర్

నేచురల్ స్టార్ నాని పీరియడ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్' పై అంచనాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఆయా షేర్' సింగిల్ విడుదల తర్వాత నెక్స్ట్ లెవల్ కి చేరుకున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ప్రతి పాత్ర రివల్ తో ఆసక్తిని మరింత పెంచుతోంది. అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్‌ప్రైజ్‌గా, హీరోయిన్ కయాదు లోహర్ పుట్టినరోజును పురస్కరించుకుని, చిత్ర నిర్మాతలు ఈరోజు ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. కయాదు లోహర్ 'ది ప్యారడైజ్' ప్రపంచంలోకి సుబ్బలక్ష్మి (సుబ్బు)పాత్రలో అడుగుపెట్టింది. సినిమా మొత్తం రగ్డ్, ఇంటెన్స్ ప్రపంచంలో సాగుతున్నప్పటికీ, ఆమె పాత్ర ఆ కథకు ఓ సాఫ్ట్ టచ్ అందించనుందని…

Read more
తలసేమియా  పై అవగాహన కల్పించి అండగా నిలవాలి: నారా భువనేశ్వరి Telugu News

తలసేమియా పై అవగాహన కల్పించి అండగా నిలవాలి: నారా భువనేశ్వరి

తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించడం తో పాటు, వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 10న తలసేమియా రన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారితో పాటు తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ స్టార్ క్రికెటర్ మిథాలి రాజ్ పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ... మీడియా మిత్రులకు, ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తలసేమియా రన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విచ్చేసిన దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు…

Read more