Skip to content

లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి అమ్మగారు ఇక లేరనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. – నందమూరి బాలకృష్ణ

తన మధురమైన గళంతో దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీతాభిమానులను అలరించిన జానకి అమ్మగారు ఇక లేరనే వార్త యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మా నాన్నగారు, స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి చిత్రాలతో పాటు.. నా చిత్రాల్లోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు ఎప్పటికీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. మా కుటుంబంతో ఆమెకు ఎంతో దశాబ్దాల అనుబంధం ఉంది. తన అద్భుతమైన గాత్రంతో భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర వేసిన జానకి అమ్మగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి! 🙏🏻

Read more

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే. నా కెరీర్‌లో ప్రేక్షకులు ప్రేమగా గుర్తుంచుకున్న ఎన్నో పాటల వెనుక జానకమ్మ గారి మధుర గాత్రం ఉంది. ఆ పాటలు వినిపించిన ప్రతిసారీ, ఆ రోజులు... ఆ జ్ఞాపకాలు... మళ్లీ కళ్లముందు సజీవంగా నిలుస్తాయి. జానకమ్మ గారు ఒక గాయని మాత్రమే కాదు... భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి. ఆమె పాడిన ప్రతి పాట ఒక జ్ఞాపకం... ఒక అనుభూతి... ఒక జీవితకాలపు అనుబంధం. ఈ రోజు మనం సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయాం. కానీ ఆమె గానం ఎన్నో…

Read more

‘హ్యాపీ జర్నీ’ నుంచి బ్యూటీఫుల్ ఫస్ట్ సింగిల్ ‘ఆనందమే’ రిలీజ్

రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా, మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల కీలక సహాయ పాత్రలను పోషించారు. గుత్తా ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ల పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న 'హ్యాపీ జర్నీ' చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతుండగా, తరుణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్‌తో భారీ అంచనాలను రేకెత్తించిన చిత్ర బృందం, ఇప్పుడు 'ఆనందమే'…

Read more

ఓ.! సుకుమారి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది: నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. 'ఓ..! సుకుమారి' ఎలా ఉండబోతోంది? ఇది మంచి…

Read more

‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో తెలుగులో పరిచయం కావడం నా అదృష్టం: హీరోయిన్ రాషా తడానీ

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాషా…

Read more

అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘ఓ..! సుకుమారి’ హిలేరియస్ థియేట్రికల్ ట్రైలర్‌

టీజర్, ఫస్ట్ సింగిల్‌తో అంచనాలను పెంచిన 'ఓ..! సుకుమారి' ఇప్పుడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్‌ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో కంప్లీట్ వినోదాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది. భరత్ దర్శన్ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, 'శివం భాజే' విజయం తర్వాత గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఈరోజు, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. దామిని గురించి ఊరంతా భయపడుతూ ఉంటుంది. కారణం ఏమిటంటే... ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విచిత్రమైన రహస్యాన్ని దాచిపెట్టి ఆమెకు హీరోతో పెళ్లి చేస్తారు…

Read more

‘కొరియన్ కనకరాజు’ ఆగస్టు 7న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ హారర్-కామెడీ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంతకుముందు విడుదలైన టైటిల్ గ్లింప్స్, హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్ కూడిన ఈ చిత్రంలోని వినోదాత్మకంగా చూపిస్తూ భారీ బజ్‌ను సృష్టించింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'కంసంనిదా' కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. చిత్ర నిర్మాతలు ఆగస్టు 7వ తేదీని ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదల తేదీగా అధికారికంగా ఖరారు చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ ఆటిట్యూడ్, ఇంటెన్స్ ని ప్రజెంట్ చేస్తోంది. వరుణ్ తేజ్ ఒక చేతిలో రక్తం మరకలున్న…

Read more

‘ది ఇండియా స్టోరీ’ ఇంటెన్స్ పోస్టర్ రిలీజ్

జీ స్టూడియోస్, ఎంఐజీ ప్రొడక్షన్ అండ్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ది ఇండియా స్టోరీ’ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు నిర్మిస్తున్నారు. సమాజానికి సంబంధించిన కీలక అంశాన్ని కోర్ట్‌రూమ్ డ్రామా రూపంలో చూపిస్తున్న ఈ సినిమా జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. విషపూరిత పురుగుమందుల వ్యవసాయం, దాని వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావం వంటి అంశాల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కొత్త పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. విడుదల చేసిన పోస్టర్‌లో కాజల్ అగర్వాల్, శ్రేయాస్…

Read more

వీఐ ఆనంద్ సై-ఫై ఎంటర్‌టైనర్ – కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం

కొన్ని సినిమాలు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలిసిన అలాంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది. రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా', 'స్వయంభు' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక…

Read more

#చిరుబాబీ2 / #చిరు158 రెయిన్ స్టంట్ సీక్వెన్స్ కోసం 12 గంటలు వర్షంలో తడుస్తూ షూటింగ్‌ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమాపై తన అంకితభావాన్ని చాటారు. బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #చిరుబాబీ2 / #చిరు158 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో సినిమాకే హైలైట్‌గా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో ప్రముఖ స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ ఆధ్వర్యంలో భారీ వర్షం నేపథ్యంలో ఓ గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో ఫైటర్లు పాల్గొంటున్నారు. ఈ ఫైట్…

Read more