భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా అద్భుతంగా వచ్చింది : డైరెక్టర్ కిషోర్ తిరుమల
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో హ్యుజ్ బజ్ను సృష్టించింది. ఈ సినిమా జనవరి 13న గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కిషోర్ తిరుమల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి కథ ఎలా ఉండబోతుంది? -ఒక భర్త తన అనుభవం వల్ల మిగతా భర్తలకి ఏం చెప్తున్నాడు.. తను ఎలాంటి స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు అనేది కథలోని ప్రధాన అంశం. -ఇందులో ఒక ప్రశ్నకి చాట్ జిపిటిలో కూడా సమాధానం దొరకలేదు…
